టర్కీలో ఆమిర్ ఖాన్.. అల్లరి పెట్టిన ఫ్యాన్స్!
on Aug 11, 2020
కరోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్లో షూటింగ్స్ చేయడానికి టాప్ స్టార్స్ ఎవరూ ముందుకు రావట్లేదు. అదే బాలీవుడ్లో ఒక్కరొక్కరుగా తమ సినిమాలను పూర్తి చేయడానికి రెడీ అంటున్నారు. ఇప్పటికే 45 రోజుల షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ సహా 'బెల్ బాటమ్' మూవీ యూనిట్ ఇంగ్లండ్కు వెళ్లింది. ఇప్పుడు 'లాల్ సింగ్ చడ్ఢా' షూటింగ్ నిమిత్తం టర్కీకి వెళ్లాడు ఆమిర్ ఖాన్.
సెట్స్ మీద ఆమిర్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే టర్కీలోని ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆమిర్తో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతుండటంతో సోసల్ డిస్టాన్సింగ్ పాటించడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టి అల్లరి చేస్తున్న అనేక వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ వీడియోలలో వైట్ టి-షర్ట్, జీన్స్, ఫేస్ మాస్క్తో కనిపిస్తున్నాడు ఆమిర్. ఏదేమైనా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారనే విషయం టర్కీ ఫ్యాన్స్తో అర్థమైంది.
'లాల్ సింగ్ చడ్ఢా' షూటింగ్ 2019 అక్టోబర్లో స్టార్ట్ అయ్యి, 2020 ఫిబ్రవరి వరకు జరిగింది. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ వచ్చే క్రిస్మస్కు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏకంగా ఏడాది పాటు విడుదల వాయిదా పడి 2021 క్రిస్మస్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్, విజయ్ సేతుపతి, మోనా సింగ్, శర్మాన్ జోషి కీలక పాత్రధారులు.
Also Read