సరైనోడుతరవాత మరోసారి...
on Jul 8, 2020
'సరైనోడు' సక్సెస్ తరవాత మరోసారి అల్లు అర్జున్, ఆది పినిశెట్టి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప'. ఇందులో పంచాయతీ సర్పంచ్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపిస్తాడనీ, అతడు అల్లు అర్జున్ అన్న పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో హీరోకి ఇద్దరు సోదరులు ఉంటారు. అందులో ఆది పినిశెట్టి ఒకరు అన్నమాట.
'సరైనోడు'లో అల్లు అర్జున్కి విలన్గా ఆది పినిశెట్టి నటించాడు. నెగెటివ్ రోల్లో యాక్టింగ్ బాగా చేశాడు. అయితే, 'పుష్ప'లో అతడికి పాజిటివ్ రోల్ అని సమాచారం. ఇటు హీరో అల్లు అర్జున్, అటు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ఆది పినిశెట్టికి రెండో సినిమా ఇది. సుకుమార్ లాస్ట్ సినిమా 'రంగస్థలం'లో రామ్ చరణ్ అన్నయ్య పాత్రలో అతడు నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'పుష్ప' షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలైంది. కాకపోతే కరోనా బ్రేక్ ఇచ్చింది. త్వరలో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్.
Also Read