బన్నీకి లైన్ చెప్పాను గానీ...
on Jan 22, 2020
'డిస్కో రాజా' సినిమా ప్రారంభం కావడానికి ముందు సంగతి... హీరో అల్లు అర్జున్, దర్శకుడు విఐ ఆనంద్ మధ్య చర్చలు జరిగాయి. ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం దాదాపు ఖాయమే అన్నట్టు వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ 'ఒక్క క్షణం' తీశారు. వసూళ్ళ సంగతి పక్కన పెడితే... దర్శకుడిగా విఐ ఆనంద్ కు ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్... టిపికల్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్ బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు విఐ ఆనంద్. అందువల్ల, అతడికి అల్లు అర్జున్ అవకాశం ఇస్తాడని అందరూ అనుకున్నారు. అయితే... రవితేజతో 'డిస్కో రాజా' స్టార్ట్ చేసాడు విఐ ఆనంద్.
మరి, బన్నీతో సినిమా సంగతి ఏంటి? అని అతడిని ప్రశ్నిస్తే... "నేను బన్నీ గారికి లైన్ చెప్పాను. మా మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంతవరకు చెప్పగలను. అలాగే గీతా ఆర్ట్స్ లో కూడా నేను ఒక సినిమా చేయాలి. గీతా ఆర్ట్స్ సంస్థ నుండి అడ్వాన్స్ తీసుకున్నాను. 'డిస్కో రాజా' ప్రొడక్షన్ హౌస్ ఎస్ ఆర్ టి ఫిలిమ్స్ కూడా నాకు అడ్వాన్స్ ఇచ్చారు. 'డిస్కో రాజా' ఓకే అయినప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ నుండి పర్మిషన్ తీసుకుని ఈ సినిమా చేశాను. తప్పకుండా వాళ్ళతో నేను సినిమా చేస్తాను" అని సమాధానమిచ్చారు. విఐ ఆనంద్ కెరీర్ లో 'డిస్కోరాజా' భారీ బడ్జెట్ ఫిల్మ్. ఎంత భారీ బడ్జెట్ ఫిల్మ్ అంటే అతడు అంతకు ముందు తీసిన సినిమాల బడ్జెట్ తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ డబుల్. ఈ సినిమా హిట్ అయితే అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ ఈజీగా వస్తుంది.