'నారప్ప' తరువాత మళ్ళీ అదే బాటలో..
on Nov 23, 2020
మల్టిస్టారర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ లా నిలుస్తున్నారు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాలా గోపాలా, ఎఫ్ 2, వెంకిమామ.. ఇలా రీసెంట్ టైమ్ లో వెంకీ ఖాతాలో పలు మల్టిస్టారర్స్ క్రెడిట్ అయ్యాయి. గత ఏడాది అయితే ఈ దగ్గుబాటి స్టార్ నుంచి వచ్చిన రెండు సినిమాలు (ఎఫ్ 2, వెంకిమామ) కూడా మల్టిస్టారర్స్ కావడం విశేషం. అయితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 'నారప్ప'లో మాత్రం వెంకటేష్ ఒక్కరే కథానాయకుడు.
కట్ చేస్తే.. 'నారప్ప' తరువాత మళ్ళీ మల్టిస్టారర్ బాట పట్టనున్నారు వెంకీ. ఇందులో భాగంగా తొలుత 'ఎఫ్2' సీక్వెల్ 'ఎఫ్3'లో నటించబోతున్నారు. ఇందులో వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ నటిస్తారని టాక్. అలాగే తన అన్న కొడుకు రానాతో కలసి ఓ వెబ్ సిరీస్ తో పాటు ఫీచర్ ఫిల్మ్ చేస్తారని టాక్. సో.. 'నారప్ప'కి ముందు, తరువాత రెండేసి మల్టిస్టారర్స్ వెంకీ ఖాతాలో ఉంటాయన్నమాట. 'ఎఫ్ 2', 'వెంకిమామ' లాగే రాబోయే బహు కథానాయకుల చిత్రాలతోనూ విక్టరీ స్టార్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటారేమో చూడాలి.
Also Read