ఫస్ట్ సాయితేజ్.. నెక్స్ట్ వైష్ణవ్ తేజ్..
on Feb 27, 2021
`ఉప్పెన`తో డ్రీమ్ డెబ్యూ ఇచ్చాడు యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. `ఉప్పెన` రిలీజ్ కి ముందే.. క్రిష్ డైరెక్టోరియల్ (కొండ పొలం)ని పూర్తి చేసిన వైష్ణవ్.. ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమాకి కమిటయ్యాడని వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే.. తాజాగా నాలుగో చిత్రానికి కూడా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా ద్వారా ఓ నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వైష్ణవ్ తేజ్ అన్న సాయితేజ్ తో బీవీఎస్ఎన్ ప్రసాద్ `సోలో బ్రతుకే సో బెటర్` అనే సినిమాని నిర్మించాడు. ఈ చిత్రంతో సుబ్బు దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వైష్ణవ్ తో ప్రసాద్ చేయబోయే సినిమా కూడా డెబ్యూ డైరెక్టర్ దే కావడం విశేషం. త్వరలోనే వైష్ణవ్, బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబో మూవీపై క్లారిటీ వస్తుంది.
Also Read