స్టార్ డైరక్టర్ మల్టీస్టారర్ కి ముహూర్తం!!
on May 6, 2019
`ఇంటిలిజెంట్` సినిమా తర్వాత స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ ఇంత వరకూ ఏ సినిమా చేయలేదు. ఆ మధ్య బాలకృష్ణతో సినిమా చేయబతోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఆ తర్వాత చాలా మంది హీరోలను సంప్రదించిన వినాయక్ ఏ సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వినాయక్ ఒక మల్టీస్టారర్ సినిమాను సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే... తమిళంలో సూపర్ హిట్టైన `విక్రమ్ వేద` చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్, నారారోహిత్ తో చేయడానికి వినాయక్ ప్లాన్ చేసాడట. ఈ సినిమాలో ఒరిజినల్ లో మాధవన్, విజయ్ సేతుపతి నటించారు హీరోలుగా, శ్రధ్దా శ్రీనాథ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటించారు. త్వరలో ఇదే సినిమా తెలుగులో రీమేక్ కాబోతుంది. ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక గతంలో వినాయక్ , వెంకీతో లక్ష్మీ సినిమా చేసాడు. ఆ సినిమా సక్సెస్ సాధించింది. మరో సారి వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది`` అన్నారు.
Also Read