రానున్న రెండేళ్లూ సందడే సందడి!
on Nov 25, 2017
రాబోతున్న రోజుల్లో టాలీవుడ్ లో అద్భుతాలే జరగనున్నాయ్. రేర్ కాంబినేషన్లు చకచకా సెట్ అయిపోతున్నాయ్. ముఖ్యంగా 2018. 19 సంవత్సరాలు అభిమానులకు ఓ రేంజ్లో విందు చేయనున్నాయని చెప్పక తప్పదు.
బాహుబలి తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడు? అనేది మొన్నటిదాకా పెద్ద ప్రశ్న. దానికి దర్శకధీరుడు.. ఒక్క ఫోటోతో సమాధానం ఇచ్చేశాడు. తారక్. రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయనున్నట్లు ప్రకటించేశాడు. అయితే.. ప్రస్తుతం ఈ హీరోలిద్దరూ బిజీ బిజీ. ఒకరు త్రివిక్రమ్ సినిమా చేస్తుంటే... ఒకరు సుకుమార్ ‘రంగస్థలం’తో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక... ఈ సినిమా ఉండబోతోందని విశ్వసనీయ సమాచారం. తారక్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభంలో ఉంది. సో... ఇది పూర్తవ్వడానికి ఏడెనిమిది నెలలు పట్టడం ఖాయం. మరోవైపు చరణ్ ‘రంగస్థలం’ చివరి దశలో ఉంది. సో... తారక్ సిినమా పూర్తయితే తప్ప.. రాజమౌళి సిినిమా మొదలు పెట్టడానికి లేదు. అంటే... ఈ సినిమా షూటింగ్ 2018 సెకండాఫ్ లో మొదలై... 2019లో విడుదల అవుతుందన్నమాట.
ఓ వైపు ‘రంగస్థలం’ షూటింగ్ అయిపోవచ్చింది. మరి రాజమౌళి మల్టీస్టారర్ షూటింగ్ మొదలయ్యేంతవరకూ చరణ్ ఖాళీగా ఉండలేడు కదా. అందుకే... ఈ లోపు బోయపాటి శ్రీను సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. 2018 చివర్లో ఈ సినిమా విడుదల ఉంటుంది.
ఇక కొరటాల శివ... ఈ దర్శకుడు మెగా హీరోతో సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశాడు. అయితే.. ఆ మెగా హీరో ఎవరు? అనేది మాత్రం చెప్పలేదు. చాలామంది చరణ్ అనుకున్నారు. అయితే... కొరటాల చెప్పిన మెగా హీరో చరణ్ కాదు... ‘బన్నీ’. నిజానికి బన్నీ, కొరటాల కాంబినేషన్లో సినిమా ఎఫ్పుడో రావాల్సింది. గతంలోనే బన్నీకి కథ చెప్పాడు కొరటాల. అయితే... ఆ కథ బన్నికి నచ్చలేదు. దాంతో ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. అయితే.. రీసెంట్ గా బన్నీకి మరో కథ వినిపించాడు కొరటాల. ఆ కథ బన్నీకి కూడా పిచ్చపిచ్చగా నచ్చేసిందట. నిర్మాతగా దిల్ రాజు రెడీ. ఇక ఆలస్యం ఎందుకుంటుంది? ‘భరత్ అను నేను’ పూర్తయిన వెంటనే... ఈ సినిమాను పట్టాలకెక్కించేయనున్నారు. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల చేయాలనేది దిల్ రాజు ప్లాన్.
ఈ సినిమా తర్వాత.. కొరటాల డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలుసా? అక్కినేని అఖిల్. కథ కూడా ఓకే అయిపోయింది. బహుశా... 2019లో ఈ సినిమా ఉండొచ్చు.
‘ఖైదీ నంబర్ 150‘ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వి.వి.వినాయక్ ఒక్క సినిమా కూడా చేయలేదు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఆయన సినిమా చేయనున్నాడు. చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నంబర్ 150, చరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘బన్నీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన వినాయక్... సాయిధరమ్ తేజ్ తో చేయనున్న సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బాస్టరే ఇస్తాడని నమ్మకంగా చెప్పొచ్చు. ఈ సినిమా 2018లో ఉంటుంది.
ఇక వచ్చే ఏడాది.. సంక్రాంతికి పవర్ స్టార్ - త్రివిక్రమ్ సినిమా, బాలయ్య ‘జైసింహ’ సందడి చేయనున్నాయ్. ఆ తర్వాత మహేశ్ ‘భరత్ అను నేను’, చరణ్ ‘రంగస్థలం’, బన్నీ ‘నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా’ సినిమాలు ఎలాగూ ఉన్నాయ్. ఈ లిస్ట్ చేస్తుంటే.. వచ్చే ఏడాది సినీ హంగామా.. మామూలుగా ఉండదని అర్థమైపోతోంది కదూ.