క్రైమ్ డ్రామాతో తరుణ్
on Nov 23, 2020
'పెళ్ళిచూపులు'తో దర్శకుడిగా తొలి అడుగేశాడు తరుణ్ భాస్కర్. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు. అలాగే పలు పురస్కారాలు కూడా. అయితే సెకండ్ వెంచర్ 'ఈ నగరానికి ఏమైంది' మాత్రం అనుకున్న ఫలితాన్ని రాబట్టకోలేకపోయింది. దీంతో.. రెండేళ్ళయినా తరుణ్ కెప్టెన్సీలో మరో సినిమా రాలేదు. ఈ గ్యాప్ లో నటుడిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. కాగా.. త్వరలోనే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మూడో చిత్రం రాబోతోంది.
ఈ విషయాన్ని తరుణ్ నే స్వయంగా వెల్లడించాడు. ఈ సారి క్రైమ్ డ్రామాతో పలకరించబోతున్నానని.. కథ తయారుచేసుకునేటప్పుడే సరికొత్త ఉత్సాహం వచ్చిందని.. తనెంతగానే ఆరాధించే స్టార్ తో ఈ సినిమా ఉంటుందని ఈ యంగ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని ముక్తాయించాడు. ఇంతకీ తరుణ్ ఏ స్టార్ తో ఈ క్రైమ్ సబ్జెక్ట్ చేయబోతున్నాడో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ చేయాల్సిన హార్స్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని.. అందుకే ఈ గ్యాప్ లో తరుణ్ ఈ క్రైమ్ డ్రామాని పట్టాలెక్కిస్తున్నాడని టాక్.