'నిశ్శబ్దం' టీజర్ వచ్చింది
on Nov 6, 2019
'అరుంధతి', 'బాహుబలి', 'రుద్రమదేవి', 'భాగమతి' వంటి సూపర్హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్ను సంపాదించుకుని, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర చేసిన చిత్రం 'నిశ్శబ్దం'. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే మూగ అమ్మాయి పాత్రలో నటించారు. గురువారం (నవంబర్ 7న) అనుష్క పుట్టినరోజు సందర్భంగా 'నిశ్శబ్దం' టీజర్ను విడుదల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజర్ను విడుదల చేశారు. తమిళం, మలయాళ టీజర్స్ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విడుదల చేయగా, హిందీ టీజర్ను స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ప్రి టీజర్.. సినిమాపై అంచనాలను పెంచగా.. ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవర్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో మాధవన్, అంజలి లుక్స్ను మూవీ యూనిట్ రీసెంట్గా విడుదల చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా, అలెక్స్ టెర్జీఫ్ స్టంట్ డైరెక్టర్గా పనిచేశారు. కోన వెంకట్ స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు.
Also Read