వరుస కలక్షన్లతో దూసుకుపోతున్న 'సైరా'......
on Oct 4, 2019
సైరా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాథను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం ఇది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం అమెరికాలో మంగళవారం మూడు వందల ఎనిమిది లొకేషన్స్ లో ప్రదర్శించిన ప్రీమియర్ లో ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల అరవై ఐదు డాలర్లను రాబట్టినట్లు పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో ఉదయం పదకొండు గంటల వరకు ముప్పై తొమ్మిది లొకేషన్స్ లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు ఆస్ట్రేలియన్ డాలర్లను సాధించినట్టు పేర్కొన్నారు. బుధవారానికి యూఎస్ లో సినిమా వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసిందంటున్నారు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల నుండి ఈ దసరా సీజన్ పూర్తయ్యే లోపు నూట డెబ్బై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తీసుకొస్తోందని సమాచారం. ఈ మూవీ ఓవర్ సీస్ లో ఇరవై కోట్ల నెట్ కలక్షన్స్ రాబట్టినట్టు సమాచారం.
ఇక కర్నాటక తమిళనాడు రాష్ట్రాల్లో సైరా పరిస్థితిని గమనిస్తే ఈ మూవీ తెలుగు కన్నడ తమిళ వర్షన్ కు సంబంధించి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ జరగడంతో ఈమూవీకి కేవలం ఈ రెండు రాష్ట్రాల నుండి ముప్పై కోట్లకు పైగా వచ్చిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో టాప్ స్టార్ అమితాబ్ ఉండి కూడా సైరాకు రెండు కోట్ల నెట్ కలక్షన్స్ మాత్రమే రావడం దేనికి సంకేతం అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే బాలీవుడ్ మీడియా సైరాకు మంచి రేటింగ్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ మూవీ కలక్షన్స్ ఈ వారంతంలో చాలా బాగుంటాయి అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో చక్కటి కలెక్షన్స్ రాబడుతుంది. సైరా మూవీ తొలి రోజు దేశ వ్యాప్తంగా యాభై కోట్ల షేర్ దాటిందని ఫిలింట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. ఓవర్ సీస్ లో ఫస్టే పది కోట్ల షేర్ రాబట్టిందని సమాచారం. అమెరికాలో ప్రీమియర్ షోలలో దాదాపు ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్లు రాబట్టింది. మొత్తం మీద సైరా సినిమాతో మెగాస్టార్ తన సత్తాను మళ్ళి చాటుకున్నారు.
Also Read