30 ఎకరాల జొన్నతోట మధ్యలో మహేష్ ఇల్లు?
on Sep 30, 2019
హైదరాబాద్ నగర శివార్లలో దిల్ రాజు, అనిల్ సుంకర 30 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ పొలంలో జొన్నతోట వేశారు. ఆ జొన్నతోట మధ్యలో ఒక ఇల్లు కట్టారు. ఇల్లు అంటే ఇల్లు కాదు. ఇంటి సెట్ వేయించారు. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' కోసమే ఆ ఇల్లు. మరి, సినిమాలో దాన్ని మహేష్ ఇంటిగా చూపిస్తారా? లేదా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇంటిగా చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇల్లు మాత్రమే కాదు, ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో కర్నూల్ కొండారెడ్డి బురుజు, ట్రైన్ సెట్స్ కూడా వేశారు. కొండారెడ్డి బురుజు అయితే మరో నాలుగేళ్లు చెక్కు చెదరకుండా ఉంటుందట.
అంత పటిష్టంగా కట్టారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. నవంబర్ కి టాకీ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. డిసెంబర్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తీయాలని ప్లాన్ చేశారు. అందులో తమన్నా స్టెప్పులు వేయనున్నారు.