ప్రభాస్తో రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేశాను: శ్రద్ధ
on Aug 12, 2019
"ప్రభాస్తో లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ సీన్స్లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ట్రైలర్ చూశాక ఎగిరి గంతులు వేయకుండా, చప్పట్లు కొట్టకుండా ఉండటానికి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నా" అని చెప్పారు శ్రద్ధా కపూర్. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైన ఆమె 'సాహో'లో ప్రభాస్ జోడీగా నటించారు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ ఆగస్ట్ 30న విడుదలవుతోంది. రెండు రోజుల క్రితం రిలీజైన 'సాహో' ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో శ్రద్ధ మాట్లాడారు. "రెండేళ్ల నుంచీ హైదరాబాద్ నా రెండో ఇల్లుగా మారింది. నిర్మాతలు నన్నెంతో ప్రేమగా చూసుకున్నారు. 'సాహో'తో పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఇంత కంటే బెస్ట్ డెబ్యూ లేదని అనుకుంటున్నాను. కథ వినగానే థ్రిల్ అయ్యాను. ప్రభాస్ హీరో అనగానే నా హ్యాపీనెస్ మూడు రెట్లు పెరిగింది. నా పాత్ర చాలా బావుంటుంది" అని ఆమె చెప్పారు.
'సాహో'లో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవ్లీన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా కీలక పాత్రలు పోషించారు.