అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్??
on Jul 26, 2019
అక్కినేని నాగార్జును తనయులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ రానుందని ఇందస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అవును కింగ్ నాగార్జున లేటెస్ట్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో `మన్మథుడు 2` చిత్రాన్ని డైరక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ , ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆగస్ట్ 9న విడుదల కానున్న ఈ సినిమా గురించి అంతటా పాజిటివ్ బజ్ ఉంది. ఈ క్రమంలో నాగార్జున , డైరక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శక ప్రతిభ నచ్చి తనయులు నాగ చైతన్య , అఖిల్ తో ఓ మల్టీస్టారర్ మూవీ చేయమని అడిగాడట. మరి నాగార్జున లాంటి హీరో అడిగితే కాదంటాడా;? వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రాహుల్. అన్నీ కుదిరితే రాహుల్ తదుపరి సినిమా ఇదే కావొచ్చు అంటున్నారు సినీ జనాలు. చూద్దాం ఎలా ఉంటుందో మరి.