త్వరలో.... 'సాహో'లో సైకో సయ్యాన్!
on Jul 3, 2019
హమ్మయ్య... రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు 'సాహో' ప్రచారం మొదలైంది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాట 'సైకో సయ్యాన్' విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. దీంతో ఈ సినిమా సంగీతంపై కూడా ఒక స్పష్టత వచ్చింది. 'సాహో' పాటలను ముగ్గురు నలుగురు సంగీత దర్శకులు చేత చేయించి ఉంటారని సంగతి స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. అయితే... పాటలు మాత్రం ఆయన ఇవ్వడం లేదు. తొలి పాటకు హిందీ సంగీత దర్శకుడు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు. ఇంతకు ముందు తెలుగులో రాజ్ తరుణ్ లవర్ చిత్రంలో ఒక పాట చేశాడు. మళ్లీ ఇప్పుడీ సాహోతో తెలుగు సంగీత ప్రియుల ముందుకు వస్తున్నాడు. పాటలు అన్నీ తనిష్క్ ఒక్కడే చేశాడా? ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు చేశారా అనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికి చిత్రబృందం కూడా సంగీత దర్శకత్వం లో హైలైట్ చేయడం లేదు. పాట విడుదల అవుతుందని మాత్రమే ప్రకటించారు. కానీ, ఒకటి మాత్రం నిజం... శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం తప్పుకున్న తర్వాత త్వరగా సంగీత దర్శకులను ఎంపిక చేసి పాటలు చేయించుకున్నారు.