`విరాటపర్వం`లో మొదటి ఘట్టం పూర్తి!!
on Jul 1, 2019
ఇటీవల రానా , సాయిపల్లవిల `విరాట పర్వం` షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగానణలోని ధరపల్లె ఓ చిన్న గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారట. దీంతో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 1990 నేపథ్యంలో జరిగే సామాజిక పరిస్థితులను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని ఓ ఎమోషనల్ డ్రామ్ గా తెరకెక్కిస్తున్నాడు వేణు ఉడుగుల. ఈ చిత్రంలో ముందు చెప్పుకున్నట్లుగా సాయి పల్లవి ఇందులో నక్సలైట్ గా కనిపించనుందట. ఇక రానా పొలిటికల్ లీడర్ గా ఓ వెరైటీ పాత్ర చేస్తున్నారట. క్లైమాక్స్ లో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కంటతడి పెట్టించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో టబు, ప్రియమణి, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.