పుకార్లకు చెక్ పెట్టిన అనుష్క
on Jun 29, 2019
అనుష్క సియాటెల్లో ఉన్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో 'సైలెన్స్' షూటింగ్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు 'నిశ్శబ్దం' అని టైటిల్ పెట్టారు. అమెరికాలోని సియాటెల్లో అనుష్క షూటింగ్ చేస్తుంటే... కొందరు 'సైరా' సెట్లో అనుష్కకు గాయమైందని పుకార్లు సృష్టించారు. నిజానికి, 'సైరా' షూటింగును ఆమె ఎప్పుడో పూర్తి చేశారు. ఆ సన్నివేశాలు గ్రాఫిక్ వర్క్స్ లో ఉన్నాయి. ఈ పుకార్లను అనుష్క ఖండించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, సియాటెల్లో షూటింగ్ చేస్తున్నాని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇటీవల యువ హీరోలు వరుసగా గాయాలు పాలు కావడంతో అనుష్కకు గాయమైందనే వార్త అటు సినిమా, ఇటు ప్రేక్షక వర్గాలను కలవరపెట్టింది. ఆమె వివరణ ఇవ్వడంతో అందరూ హ్యాపీ.