`సరిలేరు నీకెవ్వరు` అనేలా శాటిలైట్ రైట్స్!!
on Jun 25, 2019
`మహర్షి` సక్సెస్ తర్వాత మహేష్ నటించబోతున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఇటీవల `ఎఫ్2`తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంకర తో కలిసి మహేష్ బాబు కూడా ఒక ప్రొడ్యూసర్ గా వ్వవహరిస్తున్నాడు. ఇటీవల లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం బిజినెస్ పరంగా అప్పుడే హల్ చల్ సృష్టిస్తోంది. అవును హీరో మహేష్ క్రేజ్ తో పాటు హిట్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న డైరక్టర్ అనిల్ కాంబినేషన్ లో సినిమా కావడంతో భారీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. 16.5 కోట్లకు `సరిలేరు నీకెవ్వరు` సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట సన్ నెట్ వర్క్ సంస్థ. మహేష్ గత చిత్రం మహర్షి చిత్రానికి 12 కోట్లు మాత్రమే పలికగా ఇప్పుడు మహర్షి సినిమాను మించి ఈ సినిమా రేటు పలకడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Also Read