వెంకీ -ప్రిన్స్ మరోసారి కలుస్తున్నారు!!
on Jun 4, 2019
వెంకటేష్, మహేష్ బాబు `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరు మరోసారి జట్టు కట్టబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ సారి బిగ్ స్క్రీన్ పై కాదు క్రికెట్ మైదానంలో వీరిద్దరు హల్ చల్ చేయనున్నారట. ప్రజంట్ లండన్ లో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. జూలై 14 వరకు కొనసాగే ఈ మ్యాచ్ ఇండియాతో పాటు పలు కంట్రీస్ ఇందులో పాల్గొంటాయి. ఈ క్రమంలో సాధారణ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ క్రికెట్ చూడాలంటూ తహతహలాడుతున్నారు. అందులో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇక వెంకీ, మహేషలకు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో వెంకీ, మహేష్ క్రికెట్ చూడటం కోసం లండన్ పయనం కానున్నారు.
ప్రస్తుతం కుటుంబ సభ్యులతో హాలీడేస్ ను యూరప్ లో ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్. జూన్ 9న జరిగే ఇండియా , ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం లండన్ బయలు దేరుతున్నారు ఈ ఇద్దరు హీరోలు. వెంకీమామ షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ ...షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని జూన్ 9న జరిగే మ్యాచ్ ను ఇద్దరు కలిసి చూడబోతున్నారని సమాచారం. ఇక పాకిస్తాన్ తో ఈ నెల 16న జరగబోయే మ్యాచ్ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఇండియాకు రానున్నారట. బిగ్ స్క్రీన్ పై ఇద్దరు కలిసి ఫ్యాన్స్ ని సంతోష పరిచిన ఈ హీరోలు ఇప్పుడు బుల్లి తెరపై కనిపిస్తూ ఫిదా చేయబోతున్నారని సమాచారం.