అప్పుడు కృష్ణతో... ఇప్పుడు మహేశ్తో!
on Jun 1, 2019
మహేశ్బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో విజయశాంతి తెలుగు తెరపై పునరాగమనం చేస్తున్నారు. ఆమెకు ఇదే రీ ఎంట్రీ సినిమా. అదీ సుమారు 13 ఏళ్ళ తర్వాత! మహేశ్ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ఒక విశేషం అయితే... అసలు ఆమె తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చినది మహేశ్ తండ్రి కృష్ణ సినిమాతో కావడం గమనార్హం. తెలుగులో విజయశాంతి తొలి సినిమా 'కిలాడి కృష్ణుడు'. అందులో సూపర్ స్టార్ కృష్ణ హీరో. అప్పటికి ఆమె తమిళంలో దగ్గర దగ్గర పది సినిమాల వరకూ చేశారు. తెలుగులో కృష్ణ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు తండ్రితో ఎంట్రీ... ఇప్పుడు కుమారుడితో రీ ఎంట్రీ. భలే కుదిరింది కదూ. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయశాంతిది కీలక పాత్ర అట. "దైవ సంకల్పమో... దీవించిన ప్రజల అభిమాన ప్రభావమో... కొత్త విరామం తరవాత మహేశ్ గారి సినిమాతో నటిగా మళ్ళీ ప్రజల ముందుకొస్తున్నాను" అని విజయశాంతి అన్నారు.