మహేష్ ఆ సెంటిమెంట్ వదలడా??
on May 30, 2019
మహేష్ బాబు నటించిన `మహర్షి` చిత్రం మంచి టాక్ తో దూసుకెళుతూ 175 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసినట్లు ఇటీవల చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 26వ సినిమాను ఈ శుక్రవారం (మే 31) న ప్రారంభించనున్నారు. అయితే మహేష్ బాబు తన సినిమాల ప్రారంభోత్సవాలకు రాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 2 సినిమాతో తాజాగా బ్లాక్ బస్టర్ కొట్టిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ బ్బాక్ డ్రాప్ లో రూపొందే ఈ సినిమా లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. మహర్షి సినిమాను ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించి సక్సెస్ సాధించడంతో మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి అనిల్ సుంకరతో పాటు దిల్ రాజు, మహేష్ కూడా ఈ సినిమాలో భాగస్వాములు కానున్నారని సమాచారం. మిగతా నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు రేపు అధికారింగా వెల్లడించనున్నారు.