మరోసారి గోపీచంద్ తో మెహరీన్ రొమాన్స్!!
on May 2, 2019
గోపీచంద్ , మెహరీన్ జంటగా `పంతం` చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జోడీ మరోసారి కలిసి నటించేందుకు సిద్దమవుతోందో ? అంటే అవుననే వినిపిస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ లో ఆ వివరాల్లోకి వెళితే కోలీవుడ్ స్టార్ విశాల్ తో పలు యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించిన తమిళ డైరెక్టర్ తిరు. ప్రస్తుతం గోపీచంద్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ నటిస్తుండగా..
మెయిన్ హీరోయిన్ గా మెహరీన్ ఎంపిక అయ్యిందని సమాచారం. ఇటీవల దర్శకుడు తిరు. మెహరీన్ ను సంప్రదించి
కథను వినిపించాడని, కథ- పాత్ర తీరు తెన్నులు నచ్చడంతో మెహరీన్ కూడా వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. త్వరలోనే మెహరీన్ ఎంట్రీ పై క్లారిటీ వస్తుంది. ఎఫ్ 2 ఘనవిజయంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మెహరీన్. తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వల్ప విరామం తర్వాత కొత్త చిత్రాలకు అంగీకారం తెలుపుతోందని ఇన్ సైడ్ సోర్స్ టాక్.