మరో పొలిటికల్ చిత్రంలో రానా!!
on Mar 25, 2019
పొలిటికల్ సినిమాతో రానా సినిమా కెరీర్ మొదలైంది. `లీడర్` లో యంగ్ చీఫ్ మినిస్టర్ గా నటించి తొలి సినిమాతో నే మెప్పించాడు రానా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. మళ్లీ ఏడేళ్ల తర్వాత మరో పొలిటికల్ చిత్రంలో నటించాడు. అదే `నేనే రాజు నేనే మంత్రి`. జోగేంద్రగా తన పాత్రతో మెస్మరైజ్ చేసేశాడు రానా. ఈ రెండు సినిమాలు కూడా సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే చిత్రాలు కావడం విశేషం. అయితే ముచ్చటగా మూడో సారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్న సమాచారం అందుతోంది.
`నీది నాదీ ఒకే కథ`తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వేణు ఊడుగుల. తన తదుపరి చిత్రాన్ని రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో `విరాటపర్వం` అనే టైటిల్ పిరియాడికల్ డ్రామాగా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ లో నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రజాస్వామ్యం, మర్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని టచ్ చేస్తున్నారని టాక్. అలాగే ఎమర్జెన్సీలో మొదలై , 1992 తో ముగిసే కథ ఇదని సమాచారం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో నటించనున్నారని టాలీవుడ్ టాక్. మానవ హక్కుల కార్యకర్తగా ఆమె పాత్ర ఉంటుందట. ఆసక్తికరమైన విషయమేమిటంటే టబు తొలి తెలుగు` కూలీ నెం.1` ని నిర్మించిన డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. జూలైలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.