అఖిల్ సినిమాకు అతిథిగా స్టార్ హీరో!!
on Jan 18, 2019
`హలో` చిత్రం తర్వాత అఖిల్ నటిస్తోన్న చిత్రం `మిస్టర్ మజ్ను`. `తొలి ప్రేమ` లాంటి తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన వెంకీ అట్లూరి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు. అందులో భాగంగా రేపు ( 19న) ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈవెంట్ చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నాడు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ వారు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19 న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ` మిస్టర్ మజ్ను` చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయనున్నారు. తమన్ అందించిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటోంది. సినిమా పై కూడా భారీ అంచనాలతో ఉన్నారు చిత్ర యూనిట్. చూద్దాం ఈ సినిమా అయినా అఖిల్ కు సరైన సక్సెస్ ఇస్తుందో లేదో!!