చిరు కోసం ఆ ఇద్దరు కలుస్తారా!!
on Dec 28, 2018
కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అది హీరో, దర్శకుడు కావచ్చు. దర్శకుడు , సంగీత దర్శకుడు కావచ్చు. అలా త్రివిక్రమ్ , సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. `జల్సా` మూవీ నుంచి `ఖలేజా` మినహా వీరిద్దరి జర్నీ కొనసాగుతూ వచ్చింది. వీరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో..కానీ, త్రివిక్రమ్ , నితిన్ తో చేసిన `అ ఆ` సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ను కాదని అనిరుధ్ కోసం ప్రయత్నించాడు త్రివిక్రమ్. ఫైనల్ గా మిక్కి జే మేయర్ `అ ఆ` సినిమాకు మ్యూజిక్ చేశాడు. అయితే ఆ సినిమా టైమ్ లో అందరూ బడ్జెట్ లిమిట్ వల్లనో లేక దేవి బిజీగా ఉండటం వల్లనో ఆ సినిమా దేవి చేయలేదనుకున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాన్ తో చేసిన `అజ్ఞాతవాసి` చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాద్ ని తీసుకోలేదు త్రివిక్రమ్. దీంతో వీరిద్దరికీ చెడినట్లు అందరికీ అర్ధమైంది. ఇటీవల వచ్చిన `అరవింద సమేత` చిత్రానికి కూడా దేవిశ్రీకి ఇవ్వకుండా తమన్ తో మ్యూజిక్ చేయించుకున్నాడు. దీంతో అందరూ ఇద్దరికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని సినీ వర్గాలు సందేహపడ్డాయి. కొంతకాలంగా దూరం దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే గురువారం పోలీస్ లైన్ జరిగిన రామ్ చరణ్ `వినయ విధేయ రామ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇద్దరు ఒకరినొకరు పలకిరించుకున్నారు. ఇదే వేదికపై చిరంజీవి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నానంటూ ప్రకటించారు. దీంతో అయితే చాలా కాలానికి కలుసుకున్న వీరిద్దరూ...మెగాస్టార్ సినిమా కో్సం కలిసి పనిచేస్తారా? చిరంజీవి కలిసి పని చేసేలా చేస్తాడో ఏమో చూడాలి అంటున్నారు సినీ జనాలు.