మాటల మాంత్రికుడితో మెగాస్టార్!
on Dec 28, 2018
'సైరా' సినిమా సెట్స్ మీద వుండగానే... మరో రెండు సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి సంతకం చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి' తరవాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ సినిమా తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా గురించి చిరంజీవి ప్రకటించారు. "త్రివిక్రమ్తో సినిమా ప్రకటించడానికి ఇది సందర్భం కాదని తెలుసు. కానీ, చెప్పకుండా ఆయలేకపోయా. మాటల మాంత్రికుడు, పవన్ కల్యాణ్ కి అత్యంత ఆప్తుడు... తరవాత నాకూ ఆత్మీయుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో ఆల్రెడీ డివివి దానయ్యగారు సినిమా ప్లాన్ చేశారు. దానికి నేను కూడా ఎస్ అనడం జరిగింది. ఈ కాంబినేషన్ ని రామ్ చరణ్ సెట్ చేశాడు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందా? అని నేను కూడా ఎదురు చూస్తున్నా" అని చిరంజీవి చెప్పారు. గతంలో చిరంజీవి నటించిన 'జై చిరంజీవ' సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు రాశారు. తరవాత చిరంజీవి రాయకీయాల్లోకి వెళ్లడంతో ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఇప్పటికి చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్ళీ కుదిరింది.