ఆ ఇద్దరికీ ఈ సినిమా కీలకమైనది!!!
on Dec 22, 2018
యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ్ దర్శకుడు తిరు కాంబినేషన్లో.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబర్ 22న అనిల్ సుంకర ఆఫీసులో జరిగింది. ఏషియన్ సినిమాస్ సునీల్ ఈ చిత్ర తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. జనవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2019, మే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వెట్రి ఫలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పై థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాలో గోపిచంద్ కొత్త లుక్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ లుక్ కి సంబంధించిన వర్కవుట్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో విసిగిపోయి ఉన్న హీరో, అలాగే వరుసగా అపజయాలు చవిచూస్తోన్న ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ కి తమిళ దర్శకుడు తిరు అయినా ఇద్దరికీ సక్సెస్ ఇస్తాడా? ఇకనైన గోపిచంద్ సక్సెస్ బాట పడతాడా? అంటున్నారు సినీ జనాలు. ఈ ఇద్దరికీ కూడా హిట్ కంపల్సరి. కాబట్టి సదరు నిర్మాతలు ఈ చిత్రంలో కాళ్లు ,వేళ్లు పెట్టకుండా ఉంటే మంచింది అంటున్నారు మరికొంత మంది. చూద్దాం ఎలా ఉంటుందో.
Also Read