మహేష్ బాటలో బన్ని!!
on Dec 6, 2018
సూపర్ స్టార్ మహేష్ ఇటీవల ఏ ఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్స్ కొండాపూర్ లో ప్రారంభించిన విషయం తెలిసిందే. 2.0 సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ చేశారు. ఇప్పటి వరకు సినిమాలపై దృష్టి పెట్టిన మహేష్ ఏఎంబీ సినిమాస్ తో బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టాడు. దీంతో చాలా మంది ప్రముఖులు ఇప్పుడు ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో యంగ్ హీరో మల్టీప్లెక్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే....ఇప్పటికే వ్యాపార రంగంలో ఎంతో యాక్టివ్ గా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ను నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నాడట. సిటీలోని ఓ మంచి సెంటర్ లో ఉన్న ల్యాండ్ ని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరూ నిర్మించని విధంగా అత్యాధునికంగా మల్టీప్లెక్స్ నిర్మించాలని బన్ని డిసైడ్ అయ్యాడట. అధికారికంగా దీని గురించి అల్లు అర్జున్ ప్రకటన ఇవ్వక పోయినప్పటికీ ఆయన సన్నిహితుల నుంచి మాత్రం స్ట్రాంగ్ గా ఈ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు బన్ని.