ఒకే వేదికపై ఎన్టీఆర్ కుటుంబం!!
on Dec 5, 2018
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఒకే వేదికపై కనిపిస్తే నిజంగా అది కనుల పండగే అని చెప్పవచ్చు. ఇక నందమూరి అభిమానుల ఆనందానికి అవధులే ఉండవని చెప్పవచ్చు. అలాంటి వేడుకే త్వరలో తిరుపతిలో జరగనుందని తెలుస్తోంది. అవును డిసెంబర్ 16న నందమూరి ఫ్యామిలీ అంతా ఒకే వేదికను పంచుకోబోతున్నారట. ఒకసారి వివరాల్లోకి వెళితే... బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు ఇలా రెండు పార్టులుగా వస్తోన్న ఈ చిత్రం ఆడియో వేడుకను డిసెంబర్ 16న తిరుపతి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఎన్టీఆర్ కొడుకులు, ఆడియో సీడీలను ఎన్టీఆర్ కూతుళ్ల చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించిందట చిత్ర యూనిట్ . అలాగే ఎన్టీఆర్ మనవళ్లు, మనవరాళ్లు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇదే జరిగితే ఈ వేడుక కనులపండుగగా ఉంటుందంటున్నారు నందమూరి అభిమానులు.