ఎప్పుడూ నే రాజానే అంటోన్న రవితేజ!!
on Nov 29, 2018
`టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, అమర్ అక్బర్ ఆంటోని` చిత్రాలు డిజాస్టర్ గా నిలిచినా కూడా `నిన్న కానీ నేడు కానీ ఎప్పుడూ నే రాజానే అంటున్నాడు మాస్ రాజా రవితేజ. ఇటీవల విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని రవితేజ చిత్రాల్లో కెల్లా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆరున్నర కోట్లు వసూలు చేసి బయ్యర్స్ ను నిండా ముంచేసింది. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ విఐ ఆనంద్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు ఈ బుధవారం కొబ్బరికాయ కొట్టారు. అంతే కాదు షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకోసం `నిన్న కానీ నేడు కానీ ఎప్పుడూ నే రాజానే ` టైటిల్ ఖరారు చేసారు. మణిరత్నం డైరక్ట్ చేసి `ఘర్షణ` మూవీలోని పాటల పల్లవి నుంచి ఈ టైటిల్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నేలటిక్కెట్టు ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన `నన్ను దోచుకుందువటే` పేమ్ నభా నటేష్, తో పాటు ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ , టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జువాన్ నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమిళ నటుడు బాబీ సింహా విలన్ పాత్రలో నటిస్తున్నాడు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేసాడు దర్శకుడు ఆనంద్. మరి వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న రవితేజకు ఈ సినిమా అయినా ఊరటనిస్తుందో లేదో చూడాలి.