న్యూ టెక్నాలజీతో `ఆర్ ఆర్ ఆర్`!!
on Nov 23, 2018
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. ప్రజంట్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై భారీ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్రంకోసం ఇటీవల తెరకెక్కించిన `2.ఓ` చిత్రానికి యూజ్ చేసి టెక్నాలజీ కంటే కూడా హై టెక్నాలజీతో `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ చేస్తున్నాడట రాజమౌళి. ప్రజంట్ చిత్రీకరిస్తోన్న భారీ ఫైట్ చిత్రీకరించడానికి 120 కెమెరాలు యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరి హీరోల అన్ని యాంగిట్స్ ఫొటోలను 4డి టెక్నాలజీతో క్యాప్చర్ చేస్తున్నారట.
ఈ చిత్రం అంతా కూడా హై టెక్నాలజీతో షూట్ చేయనున్నారట. దాదాపు 300ల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ ని తీసుకు నే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఓ కొత్త అనుభూతిని క్రియేట్ చేస్తుందట. 2020లో చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట.