మహర్షి కోసం భారీ సెట్!!
on Nov 1, 2018
`భరత్ అనే నేను తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న 25వ చిత్రం `మహర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం యుఎస్ లో షూటింగ్ జరుపుకుటోంది. ఈ షెడ్యూల్ ముగింపు దశలో ఉంది. ఈ వారం ఆఖరులోగా మహర్షి చిత్ర యూనిట్ ఇండియాకు తిరిగానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్లో ఒక పల్లెటూరు అట్మాస్పియర్ లో సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెట్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయట. ఈ షెడ్యూల్ లో మహేష్, అల్లరి నరేష్ లతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే పై కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేయున్నారని తెలుస్తోంది. యుఎస్ నుంచి వచ్చాక మహర్షి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్ , పీవీపీ కలిసి నిర్మిస్తున్నారు.