మహర్షి... ఖర్చు తగ్గించాలి!
on Oct 19, 2018
బడ్జెట్ ఎక్కువ అవుతోందనీ, కాస్త ఖర్చులు తగ్గించాలనీ 'మహర్షి' టీమ్కి దిల్రాజు క్లియర్ కట్గా చెప్పేశార్ట. మహేష్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న 'మహర్షి' సినిమాకు ముగ్గురు నిర్మాతలు. దిల్రాజుతో పాటు వైజయంతి మూవీస్ అశ్వినీదత్, పివిపి సినిమాస్ పొట్లూరి వరప్రసాద్ ఈ సినిమాలో పార్టనర్స్. కానీ, ప్రొడక్షన్ మొత్తం దిల్రాజే చూస్తున్నారు. అందువల్ల, బడ్జెట్ విషయంలో ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటివరకూ ఇండియాలో డెహ్రాడూన్, గోవా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 'మహర్షి' షూటింగ్ జరిగింది.
ఇటీవల మేజర్ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ అమెరికా వెళ్ళింది. కథలో అమెరికా షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికా వెళ్లి లొకేషన్లు చూసుకుని వచ్చారు. అక్కడ ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వుంది. అలా చేస్తే బడ్జెట్ అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అవుతోందనీ, అందువల్ల ప్లాన్ మార్చమని దిల్రాజు చెప్పారట! అమెరికాలో అవుట్డోర్లో తీయాల్సిన సన్నివేశాలు తీయమని, ఇండోర్ సన్నివేశాలు ఇండియాలో సెట్ వేసుకుని తీద్దామని ఆయన అన్నార్ట! బడ్జెట్ కంట్రోల్ చేయకపోతే ముగ్గురు నిర్మాతలకు లాభాలు రావడం కష్టమే మరి!!
Also Read