బయోపిక్ లో తమన్నా.. బాలయ్యతో స్టెప్పులు
on Oct 11, 2018
ఎన్టీఆర్ బయోపిక్ గురించి వచ్చే ఒక్కో వార్త.. ఆ సినిమా మీద అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తుంది. ఇప్పటికే స్టార్లతో కళకళలాడుతున్న ఎన్టీఆర్ బయోపిక్.. కొత్త స్టార్ల చేరికతో ఇంకాస్త వెలిగిపోతుంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార పాత్రలలో నేటితరం తారలు మెరవనున్నారు. ఇప్పటికే అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీదేవి పాత్రలో రకుల్ లుక్ ని కూడా రెవీల్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్తో పలు చిత్రాల్లో కథానాయికగా నటించడమే కాకుండా రాజకీయాల్లో సైతం ఆయన అడుగుజాడల్లో నడిచిన జయప్రద మిల్కీ బ్యూటీ తమన్నా అలరించబోతోందట. అంతేకాదు ‘వేటగాడు’ సినిమాలోని ‘ఆకు చాటు పిందె తడిసే’ పాటను రీమిక్స్ చేసినట్లుగా.. తమన్నాతో ‘అడవిరాముడు’ సినిమాలోని ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను’ సాంగ్ను రీమిక్స్ చేయనున్నారట.