త్రివ్రిక్రమ్తో సినిమా చేయనంటోన్న నిర్మాత!!!
on Oct 1, 2018
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో `అరవింద సమేత` చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఇటీవల అల్లు అర్జున్ తో కమిటయ్యాడని న్యూస్ వచ్చాయి. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ గురించి ఒక న్యూస్ హల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే...జులాయి చిత్రానికి డి.వి.వి. దానయ్య కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సమయంలోనే తివిక్రమ్ తో సినిమా చేయడానికి డి.వి.వి దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడట. అయితే వరుసగా త్రివిక్రమ్ హారిక అండ్ హాసిని బేనర్ లో నే సినిమాలు చేస్తూ వచ్చాడు. దీని వల్ల దానయ్యకు సినిమా చేయలేదు. ప్రజంట్ చేస్తోన్న `అరవింద సమేత` కూడా హారిక అండ్ హాసిని బేనర్ లో చేస్తున్నాడు. దీని తర్వాత కూడా ఇదే సంస్థలో సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట తివిక్రమ్. ఇదిలా ఉంటే దానయ్య ప్రస్తుతం రాంచరణ్, బోయపాటితో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ,రాంచరణ్, రాజమౌళితో సినిమా ఉంది. దీంతో ఇప్పట్లో దానయ్య త్రివిక్రమతో సినిమా చేయలేననీ, ఆయన కూడా తమ బేనర్ లో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సిధ్దం గా లేడని తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ని ఇటీవల అడ్వాన్స్ తిరిగిమ్మని అడిగినట్లు సమాచారం. తివిక్రమ్ కూడా అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడట. దీన్ని బట్టి త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా కూడా హారిక అండ్ హాసిని లోనే అని అర్థమవుతోంది.