విక్రమ్ పోయి త్రివిక్రమ్ వచ్చాడా!!
on Sep 24, 2018
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `నా పేరు సూర్య` ఫ్లాప్ కావడంతో తదుపరి సినిమా కు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడంటూ న్యూస్ వచ్చాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ గా న్యూస్ ప్రకారం దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ లైన్ పట్ల బన్ని ఇంట్రస్ట్ గా లేడట. ముఖ్యంగా స్క్రిప్టు లో సెకండాఫ్ అసలు అల్లు అర్జున్ కి ఎక్కట్లేదట. అందు వల్ల ఇంకా పక్కాగా స్టోరీ రెడీ చేసుకొని రమ్మనీ, నెక్స్ట్ ఇయర్ సినిమా చేద్దామని విక్రమ్ తో బన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
`నా పేరు సూర్య` తీవ్రంగా నిరాశ పరచడంతో స్క్రిప్టు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట బన్ని. ఇదిలా ఉంటే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాలు ఇచ్చిన త్రివిక్రమ్ తోనే తన తదుపరి సినిమా చేయాలనుకుంటున్నాడట బన్ని. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత చేస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలవుతోంది. దీని తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ఇప్పటికే కథ సిధ్దం చేసాడట. త్వరలో బన్నికి కథ వినిపించబోతున్నాడట త్రివిక్రమ్. అన్ని కుదిరితే మరోసారి జులాయి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి విక్రమ్ పోయి త్రివిక్రమ్ వచ్చాడన్నమాట.