సోషల్ మీడియాలో ప్రభాస్ హల్ చల్...!!
on Sep 6, 2018
తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు కృష్ణంరాజు గారి సంస్థ కార్యాలయంలో జరిగాయి. గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో కృష్ణంరాజు గారి సమర్పణలో .... వరుస సూపర్ హిట్స్ అందిస్తున్న యువీ క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన కే కే రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రం లో ప్రభాస్ సరసన నటించనుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమౌతుంది. ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కే కే రాధాకృష్ణ దర్శకత్వంలో నేను నటించబోయే త్రి భాషా చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రారంభమైన ఈ చిత్రాన్ని గోపికృష్ణా మూవీస్... యూవీ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తోంది". అని తన ఆనందాన్ని పంచుకున్నారు ప్రభాస్.