దుఃఖాన్ని దిగమింగుకొని షూటింగ్కు సిద్ధమైన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్!
on Sep 1, 2018
కన్నతండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న నందమూరి హరికృష్ణ తనయులు కల్యాణ్రామ్, ఎన్టీఆర్ తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని తమ సినిమాల చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు.
స్వర్గీయ ఎన్టీఆర్, హరికృష్ణ లు వృత్తి విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవారట. ఇప్పుడు నందమూరి వారసులు కూడా తాతని, తండ్రిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. తమ వలన నిర్మాతలకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కల్యాణ్రామ్, ఎన్టీఆర్ లు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఎన్టీఆర్ శనివారం నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే కల్యాణ్రామ్ సోమవారం నుంచి కె.వి. గుహన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు.