సైరా వివాదం.. నైరా విరామం
on Aug 2, 2018
రెవెన్యూ అధికారులు 'సైరా నరసింహరెడ్డి' సినిమా సెట్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ వివాదానికి ఇప్పట్లో విరామం పడేలా కనిపించట్లేదు.. అసలు ఆ సెట్ రంగస్థలం సినిమా కోసం వేశారు.. దానిలోనే మార్పులు చేసి సైరా షూటింగ్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు.. అయితే షూటింగ్ కి అనుమతి తీసుకోలేదు అంటూ తాజాగా రెవెన్యూ అధికారులు సైరా సెట్ ను కూల్చేశారు.. దీనిపై స్పందించిన చిత్ర యూనిట్ ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద అనుమతి తీసుకునే షూటింగ్ చేస్తున్నాం అంటున్నారు.
కానీ అధికారులు స్పందన మాత్రం వేరేలా ఉంది.. కలెక్టర్ అనుమతితో షూటింగ్ చేసుకుని ఉంటే తమకు అభ్యంతరం ఉండేది కాదు.. కానీ ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు వ్యక్తి నుంచి అనుమతి తీసుకున్నామని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.. ఇది పరోక్షంగా భూకబ్జాకు ప్రోత్సహించడమే అవుతుందని, అందుకనే సెట్ను పాక్షికంగా కూల్చివేసినట్టు చెప్తున్నారు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు సూచించినా చిత్ర యూనిట్ లెక్క చేయలేదని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని అంటున్నారు.. మరి సైరా టీం ఇప్పటికైనా అనుమతి తీసుకొని పాక్షికంగా కూల్చివేసిన సెట్ ని రిపేర్ చేసుకొని షూటింగ్ చేసుకుంటుందో లేక వేరే స్థలంలో కొత్త సెట్ వేసుకుంటుందో చూడాలి.. అభిమానులు మాత్రం ఈ సెట్ వివాదం ఎప్పుడు ముగుస్తోందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.