రానా ఆ రాత్రి ఎవరితో గడిపాడు?
on Jul 30, 2018
దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో 2018కి గానూ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ చిత్రాలకు, నటీనటులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జియో స్పాన్సర్గా వ్యవహరించింది. ఈ ఈవెంట్కు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరో సందీప్ కిషన్, హీరోయిన్ ఈషా రెబ్బ యాంకర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం తాజాగా ఓ ఛానల్లో ప్రసారమైంది.
బాహుబలి2 చిత్రం అవార్డుల పంట పండించింది. ఉత్తమ చిత్రంగా బాహుబలి2, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ సహాయనటుడిగా రానా దగ్గుబాటి, ఉత్తమ సహాయనటిగా రమ్యకృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా, గేయ రచయితగా కీరవాణి అవార్డులను అందుకొన్నారు.తన అవార్డును అందుకోవడానికి వచ్చిన రానాను రాహుల్, సందీప్లు ఆటపట్టించారు. జియో భవిష్యవాణికి ఫోన్ చేసి.. రానాకు పెళ్లి ఎందుకు కావడం లేదని, గత రాత్రి రానా ఎవరితో గడిపారో చెప్పండి అంటూ ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు ప్రముఖులంతా అవాక్కయ్యారు.సురేష్ బాబు కొంచెం సీరియస్గా మారిపోయారు. పరిస్థితిని గమనించిన రానా.. ఈ రాత్రికి మాత్రం ఫిలింఫేర్లో ఉన్నానని చెప్పి పరిస్థితిని కూల్ చేశారు.తన యాంకరింగ్ తో ఆటపట్టించే రానా కి వీళ్లిద్దరు చుక్కలు చూపించారనే చెప్పుకోవాలి.