రాజకుమారుడికి 19 ఏళ్ళు
on Jul 30, 2018
బాల నటుడిగా కెరీర్ను ప్రారంభించి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రంతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ గా ఎదిగిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు చిత్రం విడుదలై నేటికి 19 ఏళ్ళు పూర్తయింది.ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మించారు.మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ, సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతా కథానాయికగా నటించింది.
ఈ సందర్బంగా 19 సంవత్సరాల క్రితం రాజకుమారుడు సెట్స్ లో మహేష్, సూపర్ స్టార్ కృష్ణ, రాఘవేంద్ర రావు, అశ్విని దత్ తో దిగిన అరుదైన ఫోటోని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.ఈ 19 సంవత్సరాలలో హీరో గా 24 సినిమాలలో నటించిన మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తున్నారు.మురారి సినిమా మహేష్ కెరీర్కు టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో మహేష్ బాబు స్టార్ డమ్ పొందారు. పోకిరి,అతడు,దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు ఘన విజయం సాధించాయి.