రాజమౌళి కొత్త ఇంటి ముచ్చట్లు
on Jul 25, 2018
బాహుబలి తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి.ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు బడ్జెట్ ప్రస్తుతానికి 300 కోట్లు అనుకుంటున్నారట.రాజమౌళి సినిమా మొదలు పెట్టాడంటే ఇల్లు వాకిలి గురించి పట్టించుకోడు.బాహుబలి తీస్తున్న టైంలో ఆయన ఫ్యామిలీతో కలిసి రామోజీ ఫిలింసిటీలోనే ఉండిపోయారు.తన సొంత పనివారిని కూడా అక్కడికే తెచ్చుకున్నారు.
ఇప్పుడు మల్టీస్టారర్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న జక్కన్న.. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో అల్యూమినియం ఫాక్టరీ దగ్గర నిర్మిస్తున్న సెట్ వర్క్ లో నిమగ్నమయ్యాడట.బ్రిటీష్ కాలాన్ని తలపించేలా సెట్ ను తీర్చిదిద్దుతున్నారట.అయితే ఈ సెట్ తో పాటు రాజమౌళి కోసం రెండు కోట్లతో నిర్మాత దానయ్య తాత్కాలిక ఇంటి నిర్మాణం చేపడుతున్నాడట.ఈసారి ఈ మల్టీస్టారర్ మూవీ పూర్తయ్యే వరకూ రాజమౌళి ఈ ఇల్లు కం ఆఫీస్ లోనే ఫ్యామిలీతో కలిసి ఉంటాడట.ఇంటికి వెళ్లి రావడం వల్ల టైం వేస్ట్ అని సినిమా షూటింగ్ కు ఆలస్యం కాకుండా ఉండేందుకే రాజమౌళి కోసం సకల సదుపాయాలతో ఇంటిని నిర్మిస్తున్నట్టు తెలిసింది.