ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్య, క్రిష్ మధ్య అభిప్రాయ భేదాలు!
on Jun 30, 2018
బాలకృష్ణ కథానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసందే.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.. మొదట ఈ సినిమాకి తేజని దర్శకుడిగా తీసుకున్నారు.. కానీ తేజ తప్పుకోవడంతో.. ఆ స్థానంలో క్రిష్ వచ్చారు.. బాలకృష్ణ, తన వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని క్రిష్ అద్భుతంగా తీశారన్న నమ్మకంతో ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పగించారు.. ఈ నిర్ణయం పట్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేసారు..
అయితే ఇప్పుడొక వార్త వినిపిస్తుంది.. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఒక విషయం మీద.. బాలకృష్ణ, క్రిష్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయట.. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి కథని ఒక సినిమాలో చెప్పలేం, రెండు భాగాలుగా చూపిద్దామని క్రిష్ అనుకుంటున్నారట.. బాలకృష్ణ మాత్రం, ఇటీవల వచ్చిన మహానటి తరహాలో ఒకే సినిమాలో కథంతా చెప్పేయాలి అంటున్నారట.. రెండు భాగాలు అని క్రిష్, ఒకే సినిమా అని బాలకృష్ణ ఇలా పట్టుపట్టారట.. చూద్దాం మరి ఫైనల్గా ఎవరి మాట నెగ్గుతుందో.