రాజమౌళి దర్శకత్వంలో కీర్తి సురేష్.. హీరో ఎవరు..?
on Jun 27, 2018
బాహుబలితో ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి.. తన తదుపరి సినిమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేస్తున్నారు.. ఇంకా షూటింగ్ మొదలు కానప్పటికీ ఈ మల్టీస్టారర్ మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమా చేస్తున్నాడు.. అలానే రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఇద్దరు హీరోలు ఫ్రీ అయ్యాక రాజమౌళి తన సినిమా షూట్ మొదలుపెడతారు.. అయితే ఇప్పుడొక న్యూస్ బయటికొచ్చింది.. ఈ మల్టీస్టారర్ లో ఒక హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకున్నారట.. మహానటి సినిమాతో మహానటి సావిత్రిని గుర్తు చేసిన కీర్తి, ఈ భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ అని న్యూస్ రావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. చూద్దాం మరి నిజంగా కీర్తి ఈ మల్టీస్టారర్ లో నటిస్తుందా? ఒకవేళ నటిస్తే ఇద్దరి హీరోలలో ఎవరి పక్కన నటిస్తుంది? తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.