పస లేని పవన్ కళ్యాణ్ స్పీచ్
on Mar 27, 2018
టాలీవుడ్ మొత్తం లో ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరో ఎవరు అంటే, ఠక్కున వచ్చే సమాధానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే, ఇదంతా అతను జన సేన పార్టీ పెట్టకముందు. ఎప్పుడయితే, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడో, పవన్ కళ్యాణ్ తన చరిష్మా కోల్పోయాడు. అన్నమెగాస్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి అయోమయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. నిన్న జరిగిన చల్ మోహన్ రంగ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఊహించనంతగా అభిమానుల నుండి ఆదరణ లభించలేదని చెప్పొచ్చు.
పవన్ వస్తున్న సమయంలో హంగామా చేయాల్సింది పోయి, అభిమానులు కామ్ గా కూర్చున్నారు. పవన్ స్పీచ్ ఇస్తున్న టైం లో కూడా ఆడిటోరియం మొత్తం సైలెంట్ గా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, పవన్ కళ్యాణ్ స్పీచ్ లో పస లేదు అనేది కొందరి అభిప్రాయం. తనకి ఇంకా బెరుకు పోలేదని స్పీచ్ మొదలెట్టిన పవన్, ఫాన్స్ కి కిక్కిచ్చే మాటలేం చెప్పలేదు. హీరో నితిన్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మరియు ఇతర చల్ మోహన్ రంగ టీం ని పొగడటం మించి పవన్ ఇంకో విషయం మాట్లాడింది లేదు. చాలా డిప్లొమసీ గా మాట్లాడాడు అని అంటున్నారు.