అన్ని వదిలేశాడు.. కానీ మహేశ్ కావాలట
on Feb 27, 2018
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ నిర్మాతల్లో ఒకరు పీవీపీ. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సినిమాలన్నీ బొక్క బోర్లా పడటంతో.. మనకు ప్రొడక్షన్ కలిసిరాదని.. బ్యానర్ను క్లోజ్ చేసేసి.. ఉద్యోగులకు సెటిల్మెంట్ చేసి పంపించేశాడని పీవీపీపై ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మెయిన్ ఫోకస్ మొత్తం రాజకీయల మీదే ఉందని.. రాబోయే ఎన్నికల్లో విజయవాడ లేదా గుంటూరు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని.. ఇందుకు ఓ పార్టీ అధినేతను అప్రోచ్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో పీవీపీ ఓ సినిమా స్కిప్ట్ హక్కుల కోసం కోర్టుకెక్కడం వైరల్గా మారింది.
బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఆర్థికంగా పీవీపీని ఆదుకునేందుకు తన తర్వాతి సినిమాను మీతో చేస్తానని మాట ఇచ్చాడు మహేశ్. అలా ప్రిన్స్-వంశీ పైడిపల్లి సినిమా తెర మీదకు వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఈ మూవీ నిర్మాతలుగా దిల్రాజు, అశ్వనీదత్ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి.
కొరటాల శివతో భరత్ అనే నేను కంప్లీట్ అవ్వగానే.. పైడిపల్లి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు మహేశ్ రెడీ అవుతున్నాడు. ఇలాంటి టైంలో వంశీపైడిపల్లి-మహేశ్ సినిమా చిక్కుల్లో పడింది. వంశీ తయారు చేసిన స్క్రిప్ట్పై పేటెంట్ హక్కులన్నీ తనవేనంటూ నిర్మాత పీవీపీ కోర్టుకెక్కారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం చిత్ర యూనిట్కు నోటీసులు పంపింది. తమ ఆదేశాలు వచ్చే వరకు చిత్రీకరణ జరపరాదంటూ కోర్టు స్టే ఇచ్చింది. అసలు సినిమా నిర్మాణమే వద్దనుకున్న పీవీపీ.. ఇప్పుడు మహేశ్ వెంటపడటం వెనుక రహస్యమేంటో తెలియక సినీజనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. న్యాయస్థానం ఆదేశాలపై మహేశ్, వంశీ పైడిపల్లి, అశ్వినీదత్, దిల్రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read