సాంగ్ టాక్: ఎంత సక్కగున్నావే
on Feb 13, 2018
మెగా పవర్స్టార్ రామ్చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. సహజంగానే సుకుమార్ సినిమాలపై జనాల్లో అంచనాలుంటాయి. దానికి తోడు రీసెంట్గా వచ్చిన చిట్టిబాబు, రామలక్ష్మీ టీజర్స్తో రంగస్థలంపై హై ఎక్స్పెక్టేషన్స్ను పెంచాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లోనూ వేగం పెంచింది చిత్రయూనిట్. దీనిలో భాగంగా రంగస్థలం లోని తొలి సాంగ్ను మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్.
"యేరు శెనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగా.. ఎంత సక్కగున్నావే.. లచ్చిమీ ఎంత సక్కగున్నావే".. అంటూ సాంగే పాట అదిరిపోయింది. సుకుమార్-దేవి కాంభినేషన్కు తిరుగులేదని మరోసారి రుజువైంది. 1980లలో జనాల మైండ్సెట్ లిరిక్స్లో కళ్లకు కనిపించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా... దేవిశ్రీ స్వయంగా పాడారు. అనసూయ, ప్రకాశ్ రాజ్, ఆదిపినిశెట్టి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న.. ఈ సినిమాను మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మార్చి 18న విశాఖలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read