టీజర్లో సమంత కూడా మాట్లాడలేదు
on Feb 9, 2018
మాస్ కమర్షియల్ కథలకు ఫుల్స్టాప్ పెట్టి.. కొత్తదనం కోసం అన్వేషణ ప్రారంభించిన మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తేజ్.. ధ్రువ సినిమా నుంచి పూర్తిగా తన మైండ్సెట్ను మార్చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు డిఫరెంట్ స్టోరీలను ఎంపిక చేసుకుంటు ముందుకు వెళ్తున్నాడు. ప్రజంట్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ నటిస్తోన్న సినిమా రంగస్థలం.. 1980లలో తను చూసిన వాస్తవ సంఘటనల ఆధారంగా.. సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. టైటిల్తోనే జనాన్ని ఆకట్టుకున్న రంగస్థలం.. రీసెంట్గా వచ్చిన టీజర్తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.
ఈ మూవీలో సమంత, ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నప్పటికీ వారెవరికీ టీజర్లో చోటివ్వలేదు. అయితే ఇతర నటీనటుల ఇంట్రడక్షన్ టీజర్లను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనిలో భాగంగా సమంత క్యారెక్టర్కు సంబంధించిన విజువల్స్తో ఓ చిన్న టీజర్ను పోస్ట్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.
సమంత చంకలో బిందె పట్టుకుని వెళ్తుండగా.. "ఈ పిల్లెదురు వస్తుంటే మా ఊరికి 18సం. వయస్సు వచ్చినట్టుంటదండి.. ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామలక్ష్మేనండి" అంటూ చరణ్ బ్యాక్ గ్రౌండ్లో చెబుతుండగా.. సాగే టీజర్ ఆకట్టుకుంది. బహుశా సమంత మూగదని ఆడియన్స్ని కన్విన్స్ చేసేందుకే సుక్కు ఇలా మేనేజ్ చేసినట్లున్నాడు. అన్నట్లు ఫిబ్రవరి 13 సాయంత్రం 5గం.లకు చిత్రానికి సంబంధించి తొలిపాట విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.