బావ బామ్మర్ధులకు "బాబు" షాకిస్తాడా..?
on Feb 5, 2018
మెగా ఫ్యామిలీలో ఉన్నంతమంది హీరోలు ఏ సినిమా కుటుంబంలోనూ లేరన్నది నిజం. అందుకే... సినిమాల విడుదల విషయంలో ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంటారు ఈ హీరోలు. కనీసం రెండు వారాల గ్యాప్ అయినా సరే... వీరి సినిమాల మధ్య ఉండాలి. ఇప్పటివరకూ అలాగే జరిగింది కూడా. అయితే... తొలిసారి మెగా హీరోలైన సాయిధరమ్, వరుణ్ లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఒక రోజు తేడాతో సాయిధరమ్ ‘ఇంటిలిజెంట్’, వరుణ్ ‘తొలిప్రేమ’ సినిమాలు విడుదల కానున్నాయ్. ఒకటి క్లాస్ మూవీగా.. మరొకటి కమర్షియల్ సినిమాగా తెరకెక్కి ఆడియన్స్లో హైప్ తెచ్చుకున్నాయి.
ఈ రెండు సినిమాల్ని తొలుత ఒకే రోజు రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ .. మెగా పెద్దలు జోక్యం చేసుకుని... తొలిప్రేమను ఒక రోజు వెనక్కి జరిపి ఇంటిలిజెంట్కు పోటీ లేకుండా చేశారు. అయితే వారిద్దరికి పోటీ ఇస్తానంటున్నారు.. కలెక్షన్ కింగ్ మోహన్బాబు. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన గాయత్రి.. ఫిబ్రవరి 9న విడుదలవ్వబోతోంది.
కరెంట్ ఇష్యూస్తో పాటు పొలిటిక్స్పై పంచ్ డైలాగులతో.. మోహన్బాబు విరుచుకుపడటంతో సినిమాలో ఏదో కొత్తగా ఉందనే.. ఫీలింగ్ని క్రియేట్ చేయడంలో గాయత్రి టీమ్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. దానికి తోడు ఒకప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసిన పెదరాయుడు ఆ తర్వాత తప్పుకున్నారు.. అయితే ఈ సారి ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని.. గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. గాయత్రిని అందుకు వేదికగా మార్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా హీరోల సినిమాలు అటు ఇటైతే.. ప్రేక్షకులు గాయత్రిని ఆదరించే అవకాశాలు లేకపోలేదని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.