అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు మణిశర్మ!
on Feb 5, 2018
సినిమా వాళ్ల ఇళ్లల్లో ఏది జరిగినా అది పెద్ద టాపిక్కే. మొన్నామధ్య చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రెండు లక్షలు కాజేశారు. ఆ ఘనకార్యం చేసింది ఇంట్లో పనిచేసే వ్యక్తేనని పోలీసులు తేల్చేశారు. చివరకు వాడి దగ్గర్నుంచి కొంత డబ్బును రాబట్టారు కూడా.
సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీ ఇంట్లో జరిగింది. ఆయన ఎవరో కాదు... మెలొడీ బ్రహ్మమణిశర్మ. అవును... మణిశర్మ ఇంట్లో దొంగలు పడ్డారట. పాపం... సినిమాల పనిమీద చెన్నయ్ వెళ్లిన మణిశర్మ... వారం రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చాడు. అవసరాల నిమిత్తం బీరువా ఓపెన్ చేసి చూడగా... దాచుకున్న నాలుగు లక్షలూ కనిపించలేదు. దాంతో షాక్ కి గురైన మణిశర్మ... తన మేనేజర్ సుబ్బారాయుడికి విషయం చెప్పి... బంజారాహిల్స్ పోలీస్ స్టేషనల్ లో కేసు నమోదు చేయించాడు.
మణిశర్మ పీఏ... వెంకటేశ్ అనే కుర్రాడు ఈ నిర్వాఖం చేసినట్టు మణిశర్మ అనుమానం. దాంతో వెంకటేశ్ ని పోలీసుకు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పాపం...పుణ్యం దేవుడికే తెలియాలి.