త్రివిక్రమ్ కన్ను ఆ నవలపై పడింది.. అయితే కాపీ కొట్టడట!
on Jan 30, 2018
’అజ్ఙాతవాసి’ దెబ్బకు త్రివిక్రమ్ ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు కానీ... దాని ఎఫెక్ట్ మాత్రం త్రివిక్రమ్ పై ఇంకా పడుతూనే ఉంది. తన నెక్ట్స్ సినిమా ఎన్టీయార్ తో అన్న విషయం తెలిసిందే. ‘అజ్ఙాతవాసి’ దెబ్బకు ఎన్టీయార్ కూడా త్రివిక్రమ్ విషయంలో ఆలోచనలో పడ్డాడని టాక్. అయితే... ఒక ఫ్లాప్ తో త్రివిక్రమ్ లాంటి దర్శకుని ప్రతిభను అంచనా వేయడం సబబు కాదని మళ్లీ త్రివిక్రమ్ తో పనిచేయాలని ఎన్టీయార్ నిర్ణయించుకున్నాడట.
ఇదిలావుంటే... ‘బయటి కథల్ని కాపీ కొట్టి సినిమాలు తీస్తాడు’ అనే అపప్రదను పోగొట్టుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్. అందుకే... ఇకనుంచి నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరిస్తాడట. తన దగ్గర కథ లేనప్పుడు.. బయటి కథలతో సినిమాలు చేయక తప్పదు. అలాంటి సందర్భంలో... సదరు రచయితలు కలిసి.. వాళ్లకు క్రెడిట్ ఇచ్చి.. వారి అనుమతితో సినిమాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట త్రివిక్రమ్.
ఇందులో భాగంగా... ‘మధుబాబు’ నవలను ప్రేరణగా తీసుకొని రేపు ఎన్టీయార్ తో సినిమా చేయనున్నాడట. డిటెక్టీవ్ రచయిత మధుబాబుకు ఈ కథ విషయంలో పూర్తి క్రెడిట్ ఇచ్చి ఆయన అనుమతితో సినిమా చేస్తాడట. త్రివిక్రమ్ ‘అతడు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు.. మధుబాబు నవల్స్ నుంచే తీసుకున్నట్టు ఓ విమర్శ కూడా ఉంది. ఇక ‘అ ఆ’ విషయానికొస్తే... అది యద్దనపూడి సులోచనారాణి ‘మీనా’ నవల ఆధారంగా తీసిన సినిమా అని అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా తొలుత ఆమె పర్మిషన్ తీసుకోకుండా... ఆమెకు క్రెడిట్ ఇవ్వకుండా సినిమా తీసి విడుదల చేశాడు త్రివిక్రమ్. విడుదలయ్యాక గొడవ గొడవ అవ్వడంతో.. అప్పుడు ఆమె ఇంటికెళ్లి క్షమాపణ చెప్పి.. క్రెడిట్ ఇవ్వడం జరిగింది.
రీసెంట్ గా ‘అజ్ఙాతవాసి’ సినిమా విషయంలో కూడా ఇలాంటి గోలే జరిగిన విషయం తెలిసిందే. అందుకే... ఇలాంటి తప్పులు మరోసారి పునరావృతం కాకుండా... నీజాయితీగా ముందుకెళ్తాడట మన మాటల మాంత్రికుడు..
అదనమాట విషయం. ఎనీవే.... మాటల మాంత్రికా! ఆల్ ది బెస్ట్ .
Also Read